మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 3 : చిన్నారులకు తప్పకుండా నులిపురుగు నివారణ మాత్రలు వేయించాలని దమ్మాయిగూడ మున్సిపల్ చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్,కీసర మండలం భోగారం సర్పంచ్ సుంకరి కవితజైహింద్రెడ్డి , మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ జాటక దేవరాజ్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా గురువారం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు,భోగారంలోని ప్రాథమిక పాఠశాలలో, మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో నులిపురుగుల నివారణ మాత్రలు వారు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకటి నుంచి 19 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయించాలని సూచించారు. ఈ మాత్రలు ఎటువంటి హానీ చేయవని, ప్రతి ఆరు నెలకు ఒకసారి పిల్లలకు మాత్రలు వేయాలని సూచించారు. దమ్మాయిగూడలో జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, రమేశ్గౌడ్, శ్రీ హరిగౌడ్, వైద్యులు ఆకాంక్ష, వెంకన్న, ఆశవర్కర్లు శివాని, సువర్ణ, ఉపాధ్యాయులు,పాల్గొన్నారు.భోగారంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీటీసీ ఎస్. వెంకట్రెడ్డి, పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో అంగవాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.