ఎల్బీనగర్, జూన్ 8: కొవిడ్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సాగర్ రింగ్రోడ్డులో భారీ పెయింటింగ్ మంగళవారం ఏర్పాటు చేయించి కొవిడ్తో మృతి చెందిన వారికి ఘన నివాళులర్పించారు. అనంతరం, ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా విలయం తో ఎందరో ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని, ఎందరో చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి తె లంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదన్నారు. నియోజకవర్గంలో కొవిడ్తో మరణించిన వారి పేరుతో మొక్కలు నాటుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముద్రబోయిన శ్రీనివాస్రావు, కందికంటి ప్రేంనాథ్గౌడ్, పగిడిమర్రి తిలక్రావు, నర్రె శ్రీనివాస్ కురు మ, శ్రీధర్గౌడ్, జగన్నాథ్రెడ్డి, శ్రావణ్కుమార్, మధుసాగర్, ఐలయ్య, రాము పాల్గొన్నారు.