చర్లపల్లి, జూలై 19 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా డివిజన్లవారీగా పాదయాత్రలు నిర్వహించి.. సమస్యలు పరిష్కరిస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ‘మీ కోసం మీ ఎమ్మెల్యే’ పాదయాత్రలో భాగంగా బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ భజన మందిర్, చాకలి బస్తీ, శివసాయినగర్, శుభోదయనగర్, లక్ష్మీనర్సింహా కాలనీ, వాసవీశివనగర్, టీచర్స్ కాలనీ, నాగార్జుననగర్ కాలనీ, మారుతీన గర్, సోనియాగాంధీనగర్, గాంధీనగర్, గణేశ్నగర్, సీతారామ కాలనీ, తదితర ప్రాంతాల్లో స్థానిక బీఆర్ఎస్ నా యకులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించి.. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో దశలవారీగా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తున్నామ ని, వందల కోట్ల నిధులు కేటాయించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా విద్యు త్ స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ‘మీ కోసం మీ ఎమ్మెల్యే’ పాదయాత్రకు ప్రజలనుంచి మంచి ఆదరణ లభిస్తుందని, కాలనీలో చేపడుతున్న పాదయాత్రలకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాలనీవాసులు తరలివస్తున్నారన్నారు.
వర్షాలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
నియోజకవర్గ పరిధిలో వర్షాలతో ప్రజలకు ఇబ్బందు లు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో బాక్స్ డ్రైన్ పనులు చేపట్టడంతో పాటు కోట్లా ది నిధులు కేటాయించి నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పా టు చేశామని తెలిపారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల వెంట వర్షంనీరు నిలువకుండా చర్యలు తీసుకుంటున్నామని, శిథిలావస్థకు చేరుకున్న మ్యాన్హోళ్లను గుర్తించి నూతన మ్యాన్హోళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పలు కాలనీల్లో వర్షంనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాల అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు కల్వర్ట్ నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు.
పాదయాత్రల సమస్యలకు పరిష్కారం..
పాదయాత్రలో ప్రజలు పేర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి.. సమస్య ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, గడ్డం రవికుమార్, సప్పిడి శ్రీనివాస్రెడ్డి, చర్లపల్లి, ఏఎస్రావునగర్ డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు డప్పు గిరిబాబు, కాసం మహిపాల్రెడ్డి, సారా అని ల్, కుమారస్వామి, బేతాల బాల్రాజు, ముత్యంరెడ్డి, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు జయకృష్ణ, పద్మారెడ్డి, కేవీఎల్ఎన్ రావు, గంప కృష్ణ, సారా వినోద్, కడియాల బాబు, రెడ్డినాయక్, వంశీరాజు, సర్ఫ్రా జు, శ్రీనివాస్రెడ్డి, నర్సింహాగౌడ్, చల్లా వెంకటేశ్, సత్యనారాయణ, చంద్రమౌళి, వెంకటేశ్, రమేశ్, ఉపేందర్, ఖరీం, రఫీక్, దూస మ నోహర్, కృష్ణ, ప్రహ్లాద్రెడ్డి, రవియాదవ్, మల్లారెడ్డి, హనుమంత్, యాదగిరి, రాజిరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.