సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ రోడ్డు నం: 45లోని ఖాళీ స్థలంలో ప్రజలు సేద తీరేందుకు పార్కు ఏర్పాటు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. గురువారం ఉదయం కమిషనర్ రొనాల్డ్ రోస్ కేబీఆర్ పార్కు నుంచి రోడ్డు నం:45 వరకు ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ ఖాళీ స్థలంలో పార్కు అభివృద్ధిలో భాగంగా రెయిన్ ఫారెస్ట్, ఫ్లవరింగ్ పార్కు, విజిటర్స్, టాయిలెట్స్, బోల్కర్డ్ లైటింగ్, వాటర్ బాడీ, కల్వర్టు నిర్మాణం గ్రిల్స్, ఆంఫీ థియేటర్ తదితర ఆహ్లాదకరమైన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. పార్కు అభివృద్ధికి ప్రతిపాదించిన పనులను సీఎస్ఆర్ పద్ధతిలో చేపట్టేందుకు ముందుకు వచ్చారని కమిషనర్ తెలిపారు.