మాదాపూర్ : అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ఎస్ ప్రధాన ఎజెండా అని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్, పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోనే అగ్రగామిగా నిలిపారని అన్నారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని అన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పెండింగ్లో ఉన్నటువంటి పనులను త్వరలోనే పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. స్థానికంగా ఏదైన సమస్య వాటిల్లినట్లయితే తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిపై దృష్టి పెడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదని, అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సాంబశివరావు, బాలరాజు, యునఫ్ ఖాన్, రహీం, ముక్తర్, ఖాజా, విల్సన్, అంకారావు, అజీమ్, బాబు, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.