సికింద్రాబాద్, జూన్ 26: సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. శనివారం చిలకలగూడ మున్సిపల్ గ్రౌండ్లో రూ. 44 లక్షలతో వాకింగ్ ట్రాక్, గ్రీన్బెల్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ స్థలాన్ని తామే పరిక్షిస్తామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, రామేశ్వర్గౌడ్, కిశోర్గౌడ్ పాల్గొన్నారు.
సికింద్రాబాద్, జూన్ 26: సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్చంద్రబోస్నగర్, దోబీఘాట్ తదితర ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలో ప్రారంభిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. శనివారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా నిర్వహించారు. సుభాష్చంద్రబోస్ నగర్లో 60, దోబీఘాట్లో 207 ఇండ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.