సికింద్రాబాద్, ఆగస్టు 16: సికింద్రాబాద్ నియోజకవర్గంలో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం కొత్తగా సమకూర్చిన 11 చెత్త తరలింపు వాహనాలను సీతాఫల్మండి క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల నాలా పరీవాహక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, హెల్త్ ఆఫీసర్ రవీందర్, అధికారులు, నేతలు పాల్గొన్నారు.