ఉస్మానియా యూనివర్సిటీ : అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తోందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో రాష్ట్ర ప్రజలకు నేనున్నానని భరోసా కల్పి స్తూ వారికి వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నారని గుర్తు చేశారు.
తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో బాధితుడు మహ్మద్ మజీద్కు సీఎంఆర్ఎఫ్ చెక్కును మోతె శ్రీలత శోభన్రెడ్డి అందజేశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన మజీద్కు రూ. అరవై వేలు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరయ్యాయి.
ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, నేతలు వసంత, నాగేశ్వర్రావు, చంటి కుమార్, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.