అబిడ్స్, ఏప్రిల్ 27 : ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి తెలిపారు. గోషామహల్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్ లాల్సింగ్, మాజీ కార్పొరేటర్ ముఖేష్సింగ్లతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా జుమ్మేరాత్బజార్లోని గణేశ్ ఆలయం వద్ద మూసీనది ప్రక్షాళన చేయాలని, దోమల నివారణను చేపట్టాలని, సిత్లామాత శ్మశాన వాటిక అభివృద్ధి, చాక్నావాడిలో ఫుట్పాత్ కబ్జాలు, పారిశుధ్య సమస్యలు, మంచినీటి సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దోమల నివారణకు జీహెచ్ఎంసీ అవసరమైన చర్యలను చేపడుతుందన్నారు. అదేవిధంగా నాలాల్లో పూడికతీత పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. స్థానికులు ఫిర్యాదు చేసిన సమస్యలన్నిటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు మధుసూదన్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
గన్ఫౌండ్రి డివిజన్ పరిధిలోని ఇసామియాబజార్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను గన్ఫౌండ్రి డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖతో కలిసి సందర్శించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి అమ్మవారి ఆలయంలో పూజలు.. జుమ్మేరాత్బజార్లోని అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి, కార్పొరేటర్ లాల్సింగ్, మాజీ కార్పొరేటర్ ముఖేష్సింగ్, బీజేపీ సీనియర్ నాయకులు మధుసూదన్ తదితరులు.