ఉస్మానియా యూనివర్సిటీ/అడ్డగుట్ట, సెప్టెంబర్ 1: తార్నాక డివిజన్లోని ఎంటమాలజీ సిబ్బందికి పీపీఈ కిట్లను డిప్యూటీ స్పీకర్ మోతె శ్రీలత బుధవారం పంపిణీ చేశారు. లాలాపేట జయశంకర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆపత్కాలంలో ముందుండి విధులను నిర్వహిస్తున్న ఎంటమాలజీ అధికారుల, సిబ్బంది సేవలు వెలకట్టలేనివని అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆమె ఎంటమాలజీ అధికారులకు, సిబ్బందికి హెల్త్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా సమయంలో ముందుండి విధులను నిర్వహిస్తున్న ఎంటమాలజీ సిబ్బందికి వారి ఆరోగ్య రక్షణ దృష్ట్యా కిట్లను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, నాయకులు సత్తయ్య గౌడ్, ప్రవీణ్, మహ్మద్, గౌస్, నర్సింగ్, అయోధ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.