సికింద్రాబాద్, అక్టోబర్ 19: నియోజకవర్గం ప్రజల అవసరాలకు అనుగుణంగా సకల హంగులు, సౌకర్యాలతో తార్నాక డివిజన్లోని లాలాపేటలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు చురుగ్గా సాగనున్నాయని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. మంగళవారం తార్నాక డివిజన్ పరిధిలోని లాలాపేట ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం సమీపంలో సుమారు రూ.7 కోట్ల వ్యయంతో చేపట్టిన మల్టీ పర్సస్ ఫంక్షన్ హాల్ నిర్మాణపనులను అధికారులు, టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు శోభన్రెడ్డితో కలిసి డిప్యూటీ మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా డివిజన్లోని పేదలు, మధ్యతరగతి ప్రజలు అధికంగా నివాసం ఉంటున్న లాలాపేటతో పాటు నియోజకవర్గంలోని అడ్డగుట్ట, మెట్టుగూడ డివిజన్ల ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు వినోద్, బలరాం, ఖాజా పాషా, అంబాల రమేశ్, ఎర్ర నాగరాజు, వేణుగోపాల్రెడ్డి, మంజుల, ఇందిరాతో పాటు తదితరులు పాల్గొన్నారు.