రవీంద్రభారతి, అక్టోబర్ 24: అవయవదానం మహాదానమని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలోని ఫైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో సినీవారం లఘు చిత్రాల ప్రదర్శనలో భాగంగా నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన ‘రీబర్త్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మామిడి హరికృష్ణ హాజరై నవీన్కుమార్ను అభినందించారు. ఈ చిత్రం ద్వారా అవయవదానంపై మంచి సందేశం అందించారన్నారు. అనంతరం నవీన్కుమార్ను శాలువాతో ఘనంగా సత్కరించారు.