Professor Kodandaram | రవీంద్రభారతి, మార్చి 22 : రాజకీయ కక్షలో భాగంగానే ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ను అరెస్టు చేశారని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు, రిటైర్డ్ పొఫ్రెసర్ కోదండరామ్ అన్నారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఉద్యమ ఆకాంక్షలు, విద్యాప్రమాణాలు, ప్రభుత్వ కర్తవ్యాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పౌరహక్కుల నేత హరగోపాల్తో కలిసి కోదండరామ్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో అంతర్జాతీయ స్థాయిలో విద్యాప్రమాణాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అధ్యాపకులు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని, అన్ని యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. యూజీసీ గ్రాంట్ కమిషన్కు ఏటా 6వేల కోట్లు కేటాయించేవారని, వాటిని 2వేల కోట్లకు తగ్గించారని మండిపడ్డారు. ఈ సమావేశంలో విశ్వేశ్వర్రావు, ప్రెస్ అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి, అంబటి నాగయ్య, తిప్పర్తి యాదయ్య, డా.కొండ నాగేశ్వరరావు, డా.రాయ్దాస్రాయ్, ఆర్.వెంకట్రెడ్డి, డా.ఈ ఉపేందర్, నగేశ్, రమణ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.