బంజారాహిల్స్ (హైదరాబాద్) : కేసీఆర్(KCR) ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్( Mla Danam Nagendar) అన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫిలింనగర్లోని శంకర్ విలాస్ చౌరస్తాలో ప్రారంభమయిన బైక్ ర్యాలీలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ తొమ్మిదిన్నర ఏండ్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అబివృద్దిలో దేశంలోనే నెంబర్వన్గా నిలిపిన కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోకవర్గంలో బీఆర్ఎస్(BRS) భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. కేవలం ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వచ్చి హడావుడి చేసే నాయకులను నమ్మే పరిస్థితిలో ఓటర్లు లేరని పేర్కొన్నారు.