సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లోని డెక్కన్ స్పోర్ట్స్ భవనం కూల్చివేత పనులు గురువారం ప్రారంభమయ్యాయి. కూల్చివేత పనులు షార్ట్ టెండరులో ఎస్కే మల్లు ఏజెన్సీకి దక్కింది. అయితే వారి వద్ద హైడ్రాలిక్ క్రషర్ డిమాలిషన్ విధానంలో ఈ భవనాన్ని కూల్చేందుకు సరైన మిషనరీ లేకపోవడంతో అధికారులు పనులను కృష్ణ ప్రసాద్ ఏజెన్సీకి అప్పగించారు. గురువారం రాత్రి జపాన్కు చెందిన హైరిచ్ కాంబి క్రషర్ మిషన్ను తీసుకొచ్చి ఆరో అంతస్తు నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు.
బేగంపేట్ జనవరి 26 : సికింద్రాబాద్ మినిష్టర్ రోడ్డు దక్కన్ స్పోర్ట్స్ భవనం కూల్చివేత పనులను అధికారులు గురువారం ప్రారంభించారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఫైర్, పోలీస్ అధికారులు సంయుక్తంగా ఈ కూల్చివేతల్లో పాల్గొన్నారు. చుట్టు పక్కల ఉన్న బస్తీ ఇండ్లకు, వ్యాపార సంస్థలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రాలిక్ క్రషర్ డిమాలిషన్ విధానంలో ఈ భవనాన్ని కూల్చివేయనున్నారు.
ఈ భవనం కూల్చివేతకు పదిహేను రోజుల వరకు గడువును ఇచ్చారు. భవనం ఒక వైపు ఒరిగిపోకుండా, మరో భవనంపై పడకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కూల్చివేత పనులు చేపట్టారు. కాగా ఈ భవనం కూల్చివేతకు కాంట్రాక్ట్ మొదట దక్కించుకున్న ఎస్కే మల్లు ఏజెన్సీ దగ్గర సరైన మిషనరీ లేకపోవడంతో అధికారులు వారిని తప్పించి మాలిక్ ట్రేడింగ్ అండ్ డిమాలిషన్ (కృష్ణ ప్రసాద్ ఏజెన్సీ) కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారు.
దీంతో గురువారం రాత్రి హైరిచ్ కాంబి క్రషర్ అనే అధునాతన యంత్రాన్ని భవనం వద్దకు తీసుకువచ్చి రాత్రి డిమాలిషన్ పనులు ప్రారంభించారు. కాగా ఈ భవనం ఆరో అంతస్తు నుంచి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. కూల్చివేత కోసం జపాన్కు చెందిన హైరిచ్ కాంబి క్రషర్ మిషన్ను వాడుతున్నారు. భవనం పిల్లర్స్, కాలమ్స్ను మిషన్తో కట్ చేసి భవనాన్ని కూల్చివేయనున్నారు.