ఎల్బీనగర్, డిసెంబర్ 29: నాగార్జునసాగర్ రింగ్రోడ్డు బైరామల్గూడ చౌరస్తా నుంచి బీఎన్రెడ్డినగర్ వెళ్లే దారిలో బండరాళ్లను తరలిస్తున్న టిప్పర్లు బాటసారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పెద్ద పెద్ద బండరాళ్లతో వెళ్తున్న టిప్పర్ వెనుక భాగంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వెనుక వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి టిప్పర్ డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.