హైదరాబాద్ : నగరంలోని రాంనగర్ డివిజన్ రిసాలగడ్డలో దారుణం వెలుగు చూసింది. వాటర్ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా మృతదేహం బయటపడింది. దీంతో అప్రమత్తమైన వాటర్ వర్క్స్ సిబ్బంది ముషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
సంతోష్ నగర్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కారణంగా వాటర్ పైప్లైన్ మరమ్మతులు చేపడుతున్నారు. దీంతో ముషీరాబాద్ పరిధిలో ఈ నెల 8, 9 తేదీల్లో నీటి సరఫరా బంద్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వాటర్ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా మృతదేహం బయటపడింది. విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.