సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు. మియాపూర్, మదీనాగూడ, ఉషోదయ కాలనీ తదితర ప్రాంతాల్లో సైకిల్పై తిరిగారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు తాళం వేసిన ఇండ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీసీపీ సిబ్బందికి సూచించారు. నిర్మానుష్య ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు తాళం వేసిన ఇండ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానం కలిగిన వ్యక్తులను, నేర చరిత్ర ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
-మాదాపూర్, జనవరి 14