కేపీహెచ్బీ కాలనీ, ఫిబ్రవరి 5: కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్లోని వరసిద్ధి వినాయక భ్రమరాంభమల్లికార్జున స్వామి దేవాలయంలో దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం జరిగిన ఈ వేడుకల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పురాతన ఆలయాలను పునఃనిర్మించడంతో పాటు ఆలయాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి కోసం సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
దేవాలయాలను నిర్మించుకుని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని.. మనిషిలోని ఆధ్యాత్మిక శక్తి పెరిగితే ప్రపంచమే శాంతిమయమవుతుందన్నారు. మన పూర్వీకులు దేవాలయాలను నిర్మిం చి ఊరికి మంచి జరిగేటట్టు కృషి చేశారని దేవాలయాల అభివృద్ధి, పూజా విధానంలో సైన్స్తో పాటు ఆధ్యాత్మికత కూడా ఉందన్నారు. కాలనీ 4వ ఫేజ్లో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం ఆలయంలో పాకశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, ఇన్చార్జి అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, సాయిబాబా చౌదరి, రాజేశ్రాయ్, పాతూరి గోపి, సాయిశ్రీనివాస్, శేఖర్రెడ్డి, కోదండరామయ్య, భవాని, గోపాల్ తదితరులున్నారు.
అనారోగ్యంతో దవాఖానల్లో చేరిన పేదలకు ప్రభు త్వం అండగా ఉంటుందని, సీఎం రిలీఫ్ ఫండ్తో ఆర్థికంగా చేయూతనందిస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కృష్ణారావు అందజేశారు. ఎల్లావేళ్లలా నిరుపేదలను ఆపదలో ఆదుకునే ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం పేద ప్రజల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.