మన్సూరాబాద్, జనవరి 29: దళితబంధు ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలుపై శనివారం మన్సూరాబాద్ డివిజన్ చింతలకుంటలోని ప్రలవి గార్డెన్లో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొదటగా 100 మందికి దళిత బంధు పథకం ద్వారా రూ. 10 లక్షలు అందజేస్తామని తెలిపారు. మార్చి బడ్జెట్ అనంతరం 2 వేల మందికి నియోజకవర్గంలో దళితబంధును అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్ రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస రావు, సామ తిరుమల్రెడ్డి, భవానీప్రవీణ్, నాయకులు ఈశ్వరమ్మయాదవ్, అనంతుల రాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్గౌడ్, వివిధ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, తూర్పాటి చిరంజీవి, రాహుల్ గౌడ్, అరవింద్ రెడ్డి, రవికుమార్, సత్యం చారి, రాజిరెడ్డి, శ్రీశైలంయాదవ్, వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.