సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిధిలో పోస్టల్ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలపై ఆగస్టు 12న డాక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని తెలంగాణ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఎం.మన్మధరావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్చువల్ పద్ధ్దతిలో డాక్ అదాలత్ ఉంటుందని, దీనికి సంబంధించిన ఫిర్యాదులను,సమస్యలను లెటర్, ఎన్వలాప్ ద్వారా పంపించాలని, దానిపై డాక్ అదాలత్ అని రాసి చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ హైదరాబాద్-500001 చిరునామాకు ఆగస్టు 3లోగా చేరేలా పంపించాలని కోరారు. లేఖలో మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని తప్పనిసరిగా రాయాలని సూచించారు. 12న ఉదయం 11 గంటలకు చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ హైదరాబాద్-500001 కార్యాలయంలో డాక్అదాలత్ను నిర్వహిస్తామని తెలిపారు.