బంజారాహిల్స్,మార్చి 27 : ఆన్లైన్లో కొనుగోలు చేసిన కార్డ్లెస్ మైక్లను((Cordless mics) )ఎక్సేంజ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్న వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించి(Cyber fraud) డబ్బులు కాజేశారు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి సీహెచ్.శేఖర్ ఇటీవల అమెజాన్లో కార్డ్ లెస్ మైక్లుఆర్డర్ ఇచ్చాడు.
అయితే అవి సంతృప్తికరంగా పనిచేయకపోవడంతో ఎక్సేంజ్ చేసుకోవాలని భావించాడు. దీనికోసం అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుండగా ఓ వ్యక్తి వాట్సప్లో మెసేజ్ చేశాడు. తాము పంపించే లింక్లో వివరాలను నమోదు చేయాలని, ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు తదితర వివరాలను నమోదు చేస్తే ఎక్సేంజ్ చేస్తారని నమ్మబలికారు.
దీంతో వారు సూచించిన లింక్లో వివరాలన్నీ నమోదు చేయగానే బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.50వేలు మాయమయ్యాయి. దీంతో తాను సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు గుర్తించిన బాదితుడు బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.