బంజారాహిల్స్,సెప్టెంబర్ 30: బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఓ వైద్యశాలలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ఎస్ఎస్. సిద్ధార్థరెడ్డికి ఎస్బీఐలో ఖాతా ఉంది. గత నెల 12న ఆగంతకులు అతడి డెబిట్ కార్డు నంబర్ను ఉపయోగించి రూ.42,500 నగదును డ్రా చేసుకున్నారు. బాధితుడు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయగా, కార్డును బ్లాక్ చేసి విచారణ చేపట్టారు. ఢిల్లీలో డెబిట్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో కార్డు తనవద్దే ఉందని, ఢిల్లీలో డబ్బులు ఎలా డ్రా అయ్యాయో అర్థం కావడం లేదంటూ బాధితుడు బుధవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని పలోమా అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న ప్రకాశ్ నరేడి అనే వ్యక్తి పెయింట్స్ వ్యాపారం చేస్తుంటా డు. 29న మధాహ్నం రవికుమార్ ప్రజాపత్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. 100 కేజీల పుట్టి బ్యాగ్ కావాలంటూ చెప్పాడు. ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తానంటూ నమ్మించాడు. అతడు పంపిన లింక్ ఓపెన్ చేసి.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ప్రకాశ్ ఖాతా నుంచి రెండు విడతల్లో మొత్తం రూ.40 వేలు మాయమయ్యాయి.