సిటీబ్యూరో, అక్టోబరు 9(నమస్తే తెలంగాణ)/ సుల్తాన్ బజార్: క్రికెట్ క్రీడపై బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం, అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో మాయా చంద్రకాంత్, వుప్పలా శశాంక్, రజనీష్ కుమార్, పవన్ అగర్వాల్లు క్రికెట్ బెట్టింగ్ను పలు ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు చంద్రకాంత్ ఇంటిపై సోదాలు జరిపి నలుగురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 లక్షలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.