సిటీబ్యూరో/సికింద్రాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్కుమార్ గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లా ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పవన్కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సీఎం దంపతులతో కూడిన చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు సాదం బాల్రాజ్ యాదవ్, అశోక్, కృష్ణ ముదిరాజ్, శ్రీకాంత్రెడ్డి, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.