హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయ సిబ్బందికి సీపీ మహేశ్ భగవత్ వన భోజనాలను ఏర్పాటు చేశారు. కీసరలో నిర్వహించిన వన భోజనాలకు అడిషనల్ సీపీ సుధీర్ బాబు హాజరై పలు ఈవెంట్స్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రియల్, ఐడీ, అకౌంట్స్, సీసీఆర్బీ స్టాఫ్ పాల్గొన్నారు. సిబ్బంది అంతా ఉత్సాహంగా గడిపారు. షటిల్, క్రికెట్, క్యారమ్స్, కబడ్డీ, ఖో ఖో ఆడి ఎంజాయ్ చేశారు. ఈ ఆటల్లో విజేతలుగా నిలిచిన సిబ్బందికి అడిషనల్ సీపీ సుధీర్ బాబు, మల్కాజ్గిరి డీసీపీ రక్షిత కే మూర్తి, షీ టీమ్స్ డీసీపీ సలీమా బహుమతులను ప్రదానం చేశారు.