హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ‘మత్తు’ దందాపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ము ఖ్యంగా సిటీ పోలీసులు గంజాయి వచ్చే మార్గాలను కట్టడి చేసేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. గతంలో అరెస్టయిన వారి వివరాలు సేకరించి, ఎవరెవరూ సరఫరా చేశారు? ఎక్కడి నుంచి గంజాయి వచ్చిందనే విషయాలను విశ్లేషిస్తూ.. ప్రధాన సరఫరాదారులపై దృష్టి పెడుతున్నారు.లభించే సమాచారం ఆధారంగా సూత్రదారులను పట్టుకొస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గంజాయి విక్రయదారుల వివరాలు ఏపీ, ఒడిశా రాష్ర్టాల పోలీసులకు కూడా పంపిస్తున్నారు. తెలంగాణలో విస్తృతంగా తనిఖీలు చేపడుతుండటంతో ఏజెన్సీ సరఫరాదారులు హైదరాబాద్కు గంజాయి విక్రయించవద్దని నిర్ణయించినట్లు తెలిసింది.
ఏపీ, ఒడిశా సరిహద్దు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పండించే వారు అనేక మంది ఉంటారు. వారి నుంచి కొందరు టోకుగా కొనేసి, దాన్ని ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తుంటారు. హైదరాబాద్తో పాటు శివార్లు, జహీరాబాద్, మహారాష్ట్రకు సరఫరా చేసే స్మగ్లర్లు 80 మంది వరకు ఉంటారని సమాచారం. వీళ్లంతా హైదరాబాద్కు సంబంధించిన వాళ్లే కావడంతో వారి ఫోన్ నంబర్లు అన్ని ఏజెన్సీ సరఫరాదారులు బ్లాక్ చేసినట్లు తెలిసింది. నగరంలో నిందితులు చాలా మంది పట్టుబడ్డారు. వారు ఇచ్చే సమాచారంతో ఎప్పుడైనా పోలీసులు దాడులు చేయవచ్చని తమ అడ్డాలనూ మార్చినట్లు తెలిసింది.