చార్మినార్, అక్టోబర్ 16: ఉత్సవాలు సమాజంలో మార్పులు తెచ్చి సమైక్య భావాన్ని పెంచుతాయని నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. మిలాద్ ఉన్ నబీ వేడుకలను పురస్కరించుకుని శనివారం సాలార్జంగ్ మ్యూజియంలో మత పెద్దలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు. పాతనగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో యాకుత్పుర ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ఎమ్మెల్సీ రియాజుల్ హసన్ అఫంధీతో పాటు మౌలానా సయ్యద్ ఖాద్రీ, ముఫ్తీ అహ్మద్ పాషా, ఖుబూల్ పాషా, జాఫర్ పాషా అదనపు సీపీలు షికాగోయల్, డీఎస్ చౌహాన్, విజయ్కుమార్, దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్, అదనపు డీసీపీ రఫీక్, టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మీ చక్రవర్తి, పలువురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.