అబిడ్స్, అక్టోబర్ 9: హైదరాబాద్ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు నగర సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.ఈ మేరకు శనివారం మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ధూల్పేట్ రాణి అవంతీబాయి భవన్లో హైదరాబాద్ సిటీ వెస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గంజా ముక్త్’ అవగాహన కార్యక్రమాని కి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో గంజాయి వాడకం లేకుండా చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ధూల్పేట్ యువకులు తమ భవిష్యత్తు కోసం చక్కటి మార్గాన్ని ఎంచుకోవాలని సీపీ సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి నగరానికి గంజాయిని చేరవేస్తున్న ట్రాన్స్పోర్ట్ వాహనాలను పట్టుబడితే వెంటనే సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్,ధూల్పేట్ ఎక్సైజ్ అడిషనల్ డీసీపీ నవీన్కుమార్,స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంజిరెడ్డి,వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ సిధ్దిఖీ ఎక్బాల్,గోషామ హల్ ఏసీపీ జి నరేందర్రెడ్డి, మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రణవీర్ రెడ్డి, అదనపు ఇన్స్పెక్టర్ సైదులు,గోషామహల్ కార్పొరేటర్ లాల్ సింగ్,మంగళ్హాట్ కార్పొరేటర్ పరమేశ్వరీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.