చార్మినార్, మే 29 : ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. శనివారం ఆయన పాతనగరంలో లాక్డౌన్ అమలుతీరుపై పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. లాక్డౌన్ను పటిష్టంగా అమలు పరుస్తున్నామని అన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడే క్రమంలో నగర పోలీస్ విభాగంలో ఇప్పటి వరకు 50 మంది పోలీస్ కానిస్టేబుళ్లుసైతం తమ ప్రాణాలను కోల్పోయారని సీపీ తెలిపారు. పాతనగరంలో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలు తక్కువస్థాయిలోనే నమోదవుతున్నాయన సీపీ అన్నారు. దక్షిణ మండలంలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 25 చెక్పోస్టులను ఏర్పాటు చేసి అనవసర ప్రయాణాలను నిలువరిస్తున్నామని తెలిపారు. నగర వ్యాప్తంగా 180 చెక్పోస్టుల ద్వారా లాక్డౌన్ను పటిష్టంగా అమలు పరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండల లాక్డౌన్ ఇన్చార్జి, నగర అదనపు కమిషనర్ డీఎస్ చౌహాన్, దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్, ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, ఇన్స్పెక్టర్లు గురునాయుడు, శ్రీనివాసరావుతోపాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.