కరోనా సెకండ్ వేవ్ వ్యాపించడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ పీహెచ్సీలో ఆర్టీసీ సిబ్బంది కోసం కొవిడ్ టీకా సెంటర్ను ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎండీ సునిల్ శర్మ ఆసుపత్రిలో కొవిడ్ టీకా వేయించుకున్నారు. స్థానిక కార్పొరేటర్ దేవేందర్రెడ్డి, ఈడీఓ యాదగిరి, సికింద్రాబాద్, కుషాయి గూడ డీఎంలు జగన్, సుధాకర్, ఆర్ఎం యుగెందర్ పాల్గొన్నారు. 29 డిపోల పరిధిలో ప్రారంభం… ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ పరిధిలోని 29 డిపోల పరిధిలో పని చేస్తున్న దాదాపు 18,800 మంది సిబ్బందితోపాటు, 526 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వాక్సినేషన్ వేయనున్నారు.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి శనివారం నుంచి వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసు విభాగంలో పనిచేసే వారిలో 95 శాతం మంది వ్యాక్సినేషన్ వేసుకునేలా చూడాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. ఇప్పటి వరకు సైబరాబాద్లో 75 శాతం వ్యాక్సినేషన్ తీసుకోగా.. హైదరాబాద్లో కేవలం 40 శాతం మాత్రమే టీకాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి.. ఒక్కో పోలీస్స్టేషన్కు 20 మందికి చొప్పున వ్యాక్సిన్ వేయనున్నారు.