హైదరాబాద్ : ఖాజాగుడాలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్పై స్థానిక కాలనీల్లో ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. కేర్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
వ్యాక్సిన్ కోసం ఎక్కవ సమయం నిరీక్షించకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఖాజాగుడాలోని వలస కూలీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.8 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు సీఎస్ తెలిపారు. నెలలోగా వందశాతం తొలి డోసు పూర్తి చేయగలం అని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నాం. వ్యాక్సినేషన్ తక్కువైన చోట కలెక్టర్లతో మాట్లాడుతున్నామని సీఎస్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఓఎస్డీ గంగాధర్, జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవికిరణ్ హాజరయ్యారు.