హయత్నగర్, నవంబర్ 26 : అర్హులందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని హయత్నగర్ కార్పొరేటర్ నవజీవన్రెడ్డి కోరారు. శుక్రవారం హైకోర్టు కమ్యూనిటీ హాలులో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కార్పొరేటర్ పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి ..టీఆర్ఎస్ డివిజన్ కార్యదర్శి యానాల కృష్ణారెడ్డి
హైకోర్టు కాలనీలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని టీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యానాల కృష్ణారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు శివగోని అంజలిగౌడ్ వేర్వేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వందశాతం వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసిందని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాదం శ్రీనివాస్, సెక్రటరీ సూర్యప్రకాష్, కాలనీ టీఆర్ఎస్ కమిటీ సభ్యులు సులోచన, రజిత, మంజుల పాల్గొన్నారు.
100 శాతం వ్యాక్సినేషన్కు కృషి చేస్తాం
ప్రతి కాలనీలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని బీఎన్రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం బీఎన్రెడ్డినగర్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కొంతమంది టీకాపై అపోహలతో వేయించుకోవడం లేదన్నారు. అలాంటి వారికి గుర్తించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే 100 శాతం పూర్తి చేసిన డివిజన్గా మారుస్తామన్నారు. వేగంగా పూర్తి చేస్తున్న సిబ్బందిని అభినందించారు.