కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 19 : కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మాధవరం కృష్ణారావు హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అన్నారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాలనీ 4, 7వ ఫేజ్లకు చెందిన బూత్ కమిటీ నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించిందన్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు పట్టుదలతో నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించి ఆదర్శవంతంగా అభివృద్ధి చేశారన్నారు. కేపీహెచ్బీ కాలనీలో మోడల్ రైతుబజార్, ఫిష్ మార్కెట్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, మోడల్ మార్కెట్, ఇండోర్ స్టేడియాలు, పార్కుల అభివృద్ధి, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు అందుబాటులోకి తెచ్చారన్నారు.
వేలాది కోట్లాతో కాలనీలో సమస్యలన్నీ పరిష్కరించారని.. వేలాది మందికి సంక్షేమ ఫలాలు అందాయన్నారు. చేసిన అభివృద్ధి, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు కండ్లముందే కనబడుతున్నాయని.. కృతజ్ఞతగా మాధవరం కృష్ణారావును మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత డివిజన్ ప్రజలపై ఉందన్నారు. కాలనీలలోని ప్రతి ఇంటికెళ్లి తొమ్మిదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని.. బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించేలా పనిచేయాలని కోరారు. స్థానిక నేతలంతా సంఘటితంగా పనిచేసి కృష్ణారావుకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జనగాం సురేశ్రెడ్డి, మందలపు సాయిబాబా చౌదరి, కట్టా నరసింగరావు, రాజేశ్ రాయ్, వెంకట్రెడ్డి, సాయిశ్రీనివాస్ తదితరులున్నారు.
కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 19 : అభివృద్ధి సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని.. తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ నాయత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని మాధవరం కృష్ణారావు భారీ మెజార్టీతో గెలిచేలా పనిచేయాలని మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు అన్నారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ, వివేక్నగర్ కాలనీలలో బూత్ కమిటీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయత్వంలో కూకట్పల్లిలో జరిగిన అభివృద్ధి ప్రజలకు కండ్లముంటే కనబడుతుందన్నారు. పిలిస్తే పలికే నాయకుడు మాధవరం కృష్ణారావు అని.. అందరికీ అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు. కాలనీలోని ప్రతీ ఇంటికెళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల్లో మాధవరం కృష్ణారావుకు భారీ మెజార్టీని అందించేలా కార్యకర్తలు నాయకులు సమిష్టిగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్గౌడ్, పాతూరి గోపి, పవన్కుమార్ ఉన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలుపు లాంచనప్రాయమే అని బూత్ స్థాయి కమిటీ సభ్యులకు ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్ పిలుపు నిచ్చారు. గురువారం డివిజన్ పరిధిలోని మూసాపేట దేవిగ్రాండ్ హోటల్లో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 30న తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలిపించి కూకట్పల్లిలో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై పోటీ చేసేందుకు ప్రత్యర్థి పార్టీలకు ఎదిరించే దమ్ము ధైర్యం తికమక పడుతున్నారని తెలిపారు. ఫతేనగర్ డివిజన్లోని అన్ని బూత్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి బూత్లోను మెజార్టీ ఓట్లు వచ్చేలా ఓటర్లను బోలింగ్ బూత్ వరకు తీసుకు వచ్చే బాధ్యతలను పార్టీ శ్రేణులు తీసుకోవాలని సూచించారు. బూత్ కమిటీ సభ్యులు, ఏరియా బస్తీ కమిటీ సభ్యులు సంయుక్తంగా బూత్ పరిధిలోని ఓటర్లను కలిసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరించి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిక్షపతి, సుధర్శన్రెడ్డి, సుధాకర్రెడ్డి, సురేందర్నాయుడు పాల్గొన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం.. కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గెలుపు పక్కా అని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం బాలానగర్ సామ్రాట్ ప్రెసీడెన్సీ హోటల్లో బూత్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చెరబండరాజునగర్, రాజుకాలనీ, హరిజన బస్తీ, అంబికాకాలనీ, దాసరిబస్తీ, గౌడబస్తీ, మందులబస్తీ, కుమ్మరిబస్తీ, బాలానగర్ పాతబస్తీలకు సంబందించిన 14 బూత్ కమిటీ సభ్యులతో క్షేత్రస్థాయిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బూత్ కమిటీ సభ్యులకు దిశా నిర్ధేశణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే శాసనసభ ఎన్నికలలో కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు భారీ మజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలిపారు. బూత్ కమిటీ సభ్యులు నిబద్ధతతో పని చేసి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని సూచించారు. బూత్ కమిటీ సభ్యులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేసేలా సిద్దం చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మందడి సుధాకర్రెడ్డి, ఎండీ ఖాజా, నర్రా దేవేందర్రెడ్డి, ఆర్. రవీందర్, శ్రీనివాస్ ముదిరాజ్, మహంకాలి సూరి, కుమార్, బీఎన్ స్వామి, యెలిజాల యాదగిరి, కార్యకర్తలు పాల్గొన్నారు.