ఎల్బీనగర్ : ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి కరోనా బారిన పడ్డారు. నిత్యం ప్రజల్లో మమేకమై తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నం అయ్యే సుధీర్రెడ్డి మంగళవారం నుండి జ్వరంతో బాధ పడుతున్నారు. పరీక్షలు చేయించగా కరోనా పాజిటీవ్గా తేలింది.
కరోనా తొలి దశ, రెండవ దశలోనూ కరోనా బాధితులకు సహాయం చేసేందుకు విస్త్రృతంగా కృషి చేసిన సుధీర్రెడ్డి గతంలోనూ కరోనా సోకింది. కరోనా నుండి కొలుకున్నా వెంటనే ప్రజల సమస్యలపైనే దృష్టి సారించి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆయనకు కరోనా నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు.