సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావారణంలో నిర్వహించేందుకు అనిన ఏర్పాట్లు చేవామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. వచ్చే గణేష్ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని శాఖల అధికారులతో పాటు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితితో కలిసి సమన్వయ సమావేశాన్ని గురువారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ గణేష్ నవరాత్రులకు చేస్తున్న ఏర్పాట్లు, బందోబస్తు విషయాలపై వివరించారు.
అధికార యంత్రాంగం, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గణేష్ నవరాత్రులు, నిమజ్జనానికి సంబంధించిన విషయాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసు అధికారులు అదనపు సీపీలు శిఖాగోయెల్, డీఎస్ చౌహాన్, సుధీర్బాబు, జాయింట్ సీపీలు ఏఆర్ శ్రీనివాస్, ఎం.రమేష్, విశ్వప్రసాద్, డీసీపీలు గజరావు భూపాల్, గుమ్మి చక్రవర్తి, రాధకిషన్రావు, రక్షిత కె.మూర్తి, సన్ప్రీత్సింగ్తో పాటు జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, 108 సర్వీసెస్, టూరిజం, రెవెన్యూ, విద్యుత్, టీఎస్ఆర్టీసి, అగ్నిమాపక, వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు.