చంపాపేట : ఆలయ అభివృద్ధికి తనవంతు సహకరిస్తానని ఎల్బీనగర నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధి కర్మన్ఘాట్ విలేజి గాయత్రినగర్ చౌరస్తా సమీపంలోని ఈదమ్మ ఆలయంలో సింహవాహనం, శిఖర, విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవాలలో బాగంగా మూడవ రోజు శుక్రవారం ప్రాతఃకాల పూజలు, ఉత్తరాషాడ నక్షత్రయుక్త మిథున లగ్నంలో యంత్ర ప్రతిష్ఠ, బలిహరణం, కుంభనివేదనం, పూర్ణాతి, కలశోద్వాస్యం, ఆశీర్వచనము కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు సహయ, సహాకారాలు అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు ఎమ్మెల్యే సుదీర్రెడ్డికి శాలువకప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు విఠల్ గౌడ్, టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్ కుమార్రెడ్డి, కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయ ధర్మకర్త చేగోని మల్లేశ్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, నాయకులు నిష్కాంత్ రెడ్డి, కొత్తపేట ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.