ఎల్బీనగర్, ఫిబ్రవరి 24: ఇన్నర్ రింగ్రోడ్డులో నాగోలు బ్రిడ్జి నుంచి మంద మల్లమ్మ చౌరస్తా వరకు రహదారిపై ఫ్రీ ప్రయాణం.. రోడ్డు మధ్యలో గ్రీనరీ.. ఫ్లై ఓవర్ల కింద సుందరమైన పార్కులను తీర్చిదిద్దడంతో పాటుగా ఇరువైపులా పుట్పాత్ అందాలు సమకూరుస్తున్నారు. నాగోలులో ఇరువైపులా ప్రయాణించేలా నిర్మించిన ఫ్లై ఓవర్ కింద పార్కులను మాత్రం అతి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ కామినేని జంక్షన్లో ఇరువైపులా ప్రయాణించేలా నిర్మించిన రెండు ఫ్లై ఓవర్ల కింది ప్రాంతంలో ఆక్సిజన్ పార్కు నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయి. అదే రీతిలో రోడ్డు మధ్యలోని సెంట్రల్ మీడియన్లో అందమైన మొక్కలతో డివైడర్ను అందంగా తీర్చిదిద్దారు. మంద మల్లమ్మ చౌరస్తా అనంతరం సంతోష్నగర్ ఫిసల్బండ చౌరస్తా ప్రాంతం కూడా ఫ్లై ఓవర్ నిర్మాణం అనంతరం కింద అందమైన మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం నాగోలు బ్రిడ్జి ప్రాంతం నుంచి నాగోల్ గ్రామం వైపు ఫుట్పాత్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి.
నాగోలు ప్రాంతంలో రోడ్డు పక్కన పుట్పాత్తో పాటుగా సైక్లింగ్ ట్రాక్ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ దారిలో రోడ్డు పక్కన సైక్లింగ్ చేసుకునేందుకు సుందరంగా ట్రాక్ను సిద్ధం చేస్తున్నారు. పుట్పాత్పై నడిచేందుకు వీలుగా అదే విధంగా సైకిళ్లు ప్రయాణించేలా తీర్చిదిద్దుతున్నారు.
ఇన్నర్ రింగ్రోడ్డులో నాగోలు ఎల్బీనగర్ ప్రాంతాల మధ్య అలుకాపురి- సాయి నగర్ జంక్షన్ వద్ద మరో ైప్లె ఓవర్ అందుబాటులోకి వస్తే ఈ దారిలో సాఫీగా ప్రయాణం సాగుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ విషయంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం ఆవశ్యకతపై మాట్లాడారు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా స్పందించి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది.
ఇన్నర్ రింగ్రోడ్డులో నాగోలు స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైలు లింక్ పొడగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పనులు కూడా పూర్తయితే ఈ ప్రాంతానికి రవాణా పరంగా మరింత మేలు జరుగడంతో పాటుగా ఈ ప్రాంతానికి మరింత శోభ చేకూరునున్నది.
ఇన్నర్ రింగ్రోడ్డులో నాగోలు నుంచి మంద మల్లమ్మ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణతో పాటుగా సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. రోడ్డు పక్కన పుట్పాత్లతో పాటుగా సైక్లింగ్ ట్రాక్లను సిద్ధం చేస్తాం. ఇన్నర్ రింగ్రోడ్డులో ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణంతో పాటుగా సెంట్రల్ మీడియన్, ఫ్లై ఓవర్ కింద ప్రాంతాల్లో సుందరంగా పార్కులను తీర్చిదిద్ది ఆహ్లాదకరంగా మారుస్తున్నాం.
-ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి