ఎల్బీనగర్ : వరద ముంపును తొలగించేందుకు పక్కా ప్రణాళికతో వరద కాలువల నిర్మాణం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి పేర్కొన్నారు. గడ్డిఅన్నారం డివిజన్లోని వరద నీటి ముంపు కాలనీ వాసుల అపోహలు తొలగించేందుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి గడ్డిఅన్నారం ముంపు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో వరదకాలువల నిర్మాణంపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సరూర్నగర్ చెరువు నుండి చైతన్యపురి మూసీ నాలా వరకు రెండు దారుల్లో వరదనీటి కాలువలను నిర్మాణం చేస్తున్నామని, కాలనీవాసులపై ఎలాంటి భారం పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటు న్నామన్నారు.
వచ్చే వర్షాకాలంలోపు వరదనీటి కాలువలను పూర్తి చేసి ప్రజలకు వరదముంపు లేకుండా చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కాలనీవాసులంతా తమకు సహాకారం అందించాలన్నారు. గత వారం రోజులుగా అధికారులతో సమీక్షలతో పాటుగా ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించి కాలనీవాసులతో సమావేశం ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్కుమార్, సీనియర్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, తులసీ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు కందికంటి ప్రేంనాథ్గౌడ్, గద్దగంటి రమేష్ ముదిరాజ్, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు రామా గౌడ్, చంద్రరెడ్డి, సుదర్శన్రెడ్డి, చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు.