కాచిగూడ, డిసెంబర్ 31: స్థానిక ప్రజల సహకారంతో నియోజకవర్గంలోని డివిజన్ల అభివృద్ధే లక్ష్యంగా ముందు కు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్ శివాజీనగర్లో నూతనంగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి శనివారం ఎమ్మెల్యే కాలేరు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కాంట్రాక్టర్ను హెచ్చరించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు స్థానికులు పర్యవేక్షించినప్పుడే నాణ్యమైన అభివృద్ధి పనులు జరుగుతాయని అన్నారు. అంబర్పేట నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజక వర్గంగా తీర్చిదిద్దడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ఆధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానికులు అధికారులను ఎప్పటికప్పుడు నిలదిసినప్పుడే అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సువర్ణ, సా యిబాబా, ఇరిగేషన్ ఈఈ వేణుగోపాల్, ఏఈ అరుణకుమారి, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర బీష్మాదేవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్, దాత్రిక్ నాగేందర్బాబ్జి, బి.కృష్టాగౌడ్, డాక్టర్ శిరీషాయాదవ్, బద్దుల ఓంప్రకాశ్యాదవ్, మహేశ్కుమార్, బబ్లూసింగ్ పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
గోల్నాక : అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. మూడున్నరేండ్లుగా అంబర్పేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిసున్నామన్నారు. 2023 ఏడాదిలో కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుగు సాగుతామని తెలిపారు. దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా దేశం భివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఈ ఏడాది ఫలించాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు