సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం కానిస్టేబుల్ రాత పరీక్ష జరుగనున్నది. ఇందుకోసం నగరంలో 91 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నగర జాయింట్ సీపీలు రమేశ్, రంగనాథ్, కార్తికేయ, విశ్వ ప్రసాద్లతో కలిసి నగర పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎవరినీ అనుమతించవద్దన్నారు.