హైదరాబాద్: నగరంలోని నాచారం (Nacharam) పరిధిలో ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాచారంలోని తన ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తేజావత్ రాజు మహేశ్వరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.