బంజారాహిల్స్ : రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావు ఇంటివద్ద సందడి నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు బంజారాహిల్స్ రోడ్ నెం 8లోని ఆయన నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, సమాచారహక్కు కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి తదితరులు దామోదర్రావు ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
నమస్తే తెలంగాణ ఆధిపతిగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న దామోదర్రావుకు రాజ్యసభ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. ఈ నెల 24న నామినేషన్ వేయనున్నట్లు దామోదర్రావు తెలిపారు.