హైదరాబాద్ : ఇళ్ల మధ్యలో పబ్ నిర్వహణతో ప్రతి రోజూ న్యు సెన్స్ ఎక్కువైందంటూ జూబ్లీహిల్స్ టాట్ పబ్ ముందు కాలనీ వాసుల ఆందోళన చేపట్టారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. రాత్రిళ్లు రెండు, మూడు వరకు పబ్లో గడుపుతున్న యువత ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరంగా ఉంటుందంటూ ఆందోళన చేపట్టారు.
పబ్లో తాగేసిన మద్యం బాటిల్స్ ను కొందరు యువకులు ఇళ్లలోకి విసురుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ప్రవర్తనతో వృద్ధులు, పెద్ద వారు, చిన్న వారికి తలనొప్పిగా మారిందన్నారు. .. వెంటనే పబ్ను ఇక్కడి నుంచి తీసివేయాలని డిమాండ్ చేశారు.