మాదాపూర్, ఏప్రిల్ 24: కావూరిహిల్స్, కాకతీయ హిల్స్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మాదాపూర్ ఉప కమిషనర్ బాలకృష్ణతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కాకతీయ హిల్స్ పార్క్ 1 షటిల్, పికిల్ బాల్ కోర్టులను అభివృద్ధి చేయాలని, రోడ్డు నంబర్ 6 నుంచి 11 మధ్య గల వక్ఫ్ భూమి ప్రాంతంలో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను తక్షణమే తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం కాకతీయ హిల్స్లో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే అవగాహన ర్యాలీలో స్థానికులతో కలిసి ఆమె పాల్గొన్నారు.