కంటోన్మెంట్, ఆగస్టు 29: చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉద్యోగం సంపాదించుకోవడమే కాకుండా దేశానికి మంచి పేరు తీసుకురావాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ సూచించారు. నేషనల్ స్పోర్ట్స్ డే, మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన పలువురు క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఎల్.శర్మన్ హాజరై మాట్లాడుతూ.. హాకీ క్రీడాకారులుగా మేజర్ ధ్యాన్ చంద్ దేశానికి ఎంతో పేరు తెచ్చారని కొనియాడారు. నేటి క్రీడాకారులు అర్జున అవార్డు గ్రహీతలు కావాలని ఆకాంక్షించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను రోల్ మోడల్గా తీసుకొని నేటి క్రీడాకారులు ముందుకెళ్తే విజయం మీ వైపే ఉంటుందన్నారు. కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత అన్ప్ కూమార్ వ్యామా, బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ శ్రీనివాస్, కోచ్లు విజయ భాస్కర్రెడ్డి, జైపాల్, నిర్మల్ సింగ్, మనోజ్రెడ్డి, పూర్ణచందర్, కుమారస్వామి, దీపక్ ప్రసాద్, విశాల్, రాజేశ్, శ్రీకాంత్, రామకృష్ణ పాల్గొన్నారు.