మేడ్చల్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 9న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో సీఎం రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు ఆదేశించారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ జోయోల్ డెవీస్లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.