సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు అవసరమైన కుల, జన, ఆధార్, సదరం, అర్ఫన్ వంటి సర్టిఫికెట్లు జారీ చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిర్ణయించారు.
సోమవారం యూసుఫ్గూడలోని శిశువిహార్లో సర్టిఫికెట్ల జారీకి ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ప్రత్యేక కేంద్రాలు ఈ నెల 27 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ సికింద్రాబాద్ ఆర్డీవో రవికుమార్, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు, జిల్లా వెనకబడిన తరగతుల జిల్లా అధాకారి ఆశన్న, తదితరులు పాల్గొన్నారు.