హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): గడిచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు విషయంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడటం వెనుక.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మార్గదర్శకత్వం, ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం, అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన, నిరంతరాయంగా విద్యుత్తు అందించడానికి విద్యుత్తు సంస్థల ఉద్యోగులు, కార్మికులు శ్రమ.. అందరూ కలిసి ఒక టీం లాగా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమయ్యిందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. గురువారం విద్యుత్ సౌధలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం సీఎండీ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పుడు 7778 మెగావాట్లుగా ఉన్న విద్యుత్తు స్తాపిత సామర్థ్యం.. ఇప్పుడు 18453 మెగావాట్లకు చేరిందని, మరో 8085 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఎండీ సి.శ్రీనివాసరావు, ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు జి.నర్సింగరావు, టి.జగత్రెడ్డి, జె.సూర్యప్రకాశ్, బి.నర్సింగరావు, ఎం.సచ్చిదానందం, సీహెచ్.వెంకటరాజం, ఎస్.అశోక్కుమార్, టీఆర్కే రావు, బి.లక్ష్మయ్య, ఏ.అజయ్ తదితరులు పాల్గొన్నారు.