గోల్నాక : పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్ దవాఖానాలో చికిత్స పొంతుతున్న అంబర్పేట డివిజన్కు చెందిన సల్మాఅయేషా కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.2 లక్షల విలువగల ఎల్వోసీని ఎమ్మెల్యే బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు